
జనరల్

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకుండా వ్యాపారాల అభివృద్ధికి సహాయపడే సలహాదారులుగా ఎదగాలని అన్నారు. గచ్చిబౌలిలో జరిగిన ఐసీఏఐ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. కృత్రిమ మేధను తమ వృత్తిలో భాగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వ్యాపార విస్తరణ, ట్యాక్స్లు, జీఎస్టీ నిర్వహణలో సీఏల పాత్ర కీలకమని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఆయన, తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ మరవకుండా గౌరవించాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!