
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్వోసీలు రూపొందించి, నకిలీ ధ్రువపత్రాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు ఆరోపణలపై 8 ప్రైవేట్ ఇంటర్ కాలేజీలపై కేసులు నమోదయ్యాయి. గుర్తింపు ప్రక్రియలో భాగంగా తప్పుడు పత్రాలను సమర్పించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై హైడ్రా అదనపు డైరెక్టర్ లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే సంబంధిత ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంలో మరిన్ని వివరాలను వెలికితీసేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!