
సినిమాలు

హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి ముత్యంరెడ్డి మణిదీప్ రెడ్డి ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లి గత 45 రోజులుగా ఆచూకీ లేకుండా పోవడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, విద్యార్థి తల్లిదండ్రులను స్వయంగా కలసి బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి భరోసా ఇచ్చారు.
ఉన్నత చదువుల కోసం ఆశలతో విదేశాలకు పంపిన కుటుంబం ఇప్పుడు సమాచారం లేక బాధపడుతున్న పరిస్థితి దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుని కేంద్రం, రాయబార కార్యాలయం, పోలీసులకు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన స్వాగతించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!