
సినిమాలు

సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు కోసం ఇప్పటికే ఉన్నతాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దర్యాప్తు సక్రమంగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును అరెస్ట్ చేశామని, ఈరోజే కోర్టు ముందు హాజరుపరుస్తామని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, దర్యాప్తు ఎలా సాగుతుందో వేచి చూడాలని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!