

హిమాచల్ ప్రదేశ్లోని 13,800 అడుగుల ఎత్తులో ఉన్న సర్ పాస్ ట్రెక్ను విజయవంతంగా అధిరోహించిన హైదరాబాద్కు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి వి. సిరి అత్షాను తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోక్ భవన్లో సత్కరించారు. చిన్న వయస్సులోనే కఠినమైన ట్రెక్కింగ్ను పూర్తి చేసి ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన ఆమెను గవర్నర్ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సిరి అత్షా లడఖ్లోని ఉమ్లింగ్ లా పాస్ సందర్శించిన అనుభవాలను గవర్నర్తో పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు రహదారిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో గుర్తింపు పొందిన ఆ ప్రదేశం గురించి ఆమె వివరించారు. క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!