
క్రీడలు

నెల్లూరులోని చారిత్రక బారాషహీద్ దర్గాలో నేడు గంధమహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ప్రసిద్ధ రొట్టెల పండుగలో భాగంగా జరుగుతున్న ఈ వేడుకలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారులు భక్తులు, వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయగా, భక్తులు అందించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!