
జనరల్

కోటా రైల్వే స్టేషన్ పరిధిలో రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ రైలులో ఒక బోగీలో మొదలైన మంటలు మరో బోగీకి వ్యాపించడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది.
అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేయగా, రైల్వే సిబ్బంది మంటలు ఉన్న బోగీలను ఇతర భాగాల నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!