
జనరల్

పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని, పేపర్ లీకులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటోందని, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.
నిరసన సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్పందించిన యూత్ కాంగ్రెస్ నాయకులు అరెస్టులతో ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!