

చియాన్ విక్రమ్ హీరోగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధ్రువ నక్షత్రం’ చిత్రం విడుదలకు మరోసారి న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. సినిమా పూర్తై నాలుగైదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. నిర్మాతలు, పెట్టుబడిదారుల మధ్య కొనసాగుతున్న వివాదం కోర్టులో ఉండటంతో విడుదల పలుమార్లు వాయిదా పడింది. గతంలో 2026 జూన్ 15న సినిమాను విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని గౌతమ్ వాసుదేవ్ మీనన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆ తేదీన విడుదల సాధ్యపడలేదు.
తాజాగా ‘ధ్రువ నక్షత్రం’ను విడుదల చేసేందుకు 2026 ఈ నెల 30 వరకు గడువు పొడిగించాలని కోరుతూ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థనపై విచారణను జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి 2026 సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా విడుదలపై కోర్టు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!