
జనరల్

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొన్న ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సీఎస్ను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!