

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్లో కీలక పర్యటనకు బయలుదేరుతున్నారు. జూన్ 14న మధ్యాహ్నం 11.35 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి సింగపూర్ చేరుకుంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, ముఖ్యంగా అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చలు ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
మొదటి రోజున భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అనంతరం స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం యూఎన్ హాబిటాట్ ప్రతినిధి అనాక్లాడియా రాస్బాచ్తో విందు సమావేశం, సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్, గూగుల్ క్లౌడ్ ఏపీఏసీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. అలాగే సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో కూడా భేటీ అవుతారు.
రెండవ రోజున సీబీఎన్@361 కార్యక్రమాన్ని ప్రారంభించి, సెమికండక్టర్, అమరావతి ప్లానింగ్ సమావేశాల్లో పాల్గొంటారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ప్రసంగించి, ఇన్నోవేషన్ ప్రదర్శనలను సందర్శిస్తారు. అనంతరం సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో పాల్గొని జూన్ 16 రాత్రి 10 గంటలకు స్వదేశానికి తిరిగి వస్తారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!