

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. భారత్–సింగపూర్ మధ్య ఉన్న బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై హై కమిషనర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామిగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు.
రాష్ట్రంలోని అవకాశాలపై మాట్లాడిన సీఎం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ఉన్న అనుకూలతలను వివరించారు. షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్లో ఎంఆర్వో కేంద్రాలకు కూడా అవకాశాలున్నాయని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని విస్తరిస్తున్నామని, హార్టికల్చర్ ఉత్పత్తులు ప్రపంచ స్థాయి ఎగుమతులకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రోబోటిక్స్, మెడికల్ డివైసెస్ రంగాల్లో సహకారం కోరుతూ, సింగపూర్ విశ్వవిద్యాలయాలు–ఏపీ విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!