
జనరల్

ఆంక్షలు ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా కీలకమైన చబహార్ పోర్టు నిర్మాణ పనులు నిలకడగా కొనసాగుతున్నాయని భారత్లో ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫతాలి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై మీడియాలో వచ్చిన అనేక వార్తలు కేవలం ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు.
మధ్య ఆసియా, అఫ్ఘానిస్థాన్ దేశాలతో వాణిజ్యాభివృద్ధికి భారతదేశానికి చబహార్ పోర్టు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరినాటికి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధి గుండా భారత్ సహా మిత్రదేశాల నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ కట్టుబడి ఉందని, ఇరాన్లోని భారతీయుల హక్కులు, భద్రతకు పూర్తి హామీ ఉందని తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!