

ఎబోలా వైరస్పై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం భారత్లో ఎబోలా ముప్పు లేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు క్వారంటైన్ ప్రోటోకాల్స్ను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ సరిహద్దులు, ప్రవేశ కేంద్రాల్లో హైఅలర్ట్ ప్రకటించి పర్యవేక్షణను పెంచింది.
ల్యాబ్ పరీక్షలు, ఆస్పత్రుల సన్నద్ధత, అత్యవసర వైద్య వ్యవస్థలపై కేంద్ర ఆరోగ్యశాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖలు, విమానాశ్రయ అధికారులు, వైద్య సంస్థల మధ్య సమన్వయం బలోపేతం చేయాలని సూచించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. వేగవంతమైన స్పందన వ్యవస్థలతో దేశం అప్రమత్తంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!