

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025–26కు తెలంగాణ నుంచి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానం) సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రానికి కేటాయించిన మొత్తం బియ్యం సేకరణ లక్ష్యం 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, బీజేపీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
జూలై 8న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కోరినట్లు వెల్లడించారు. ఈ విజ్ఞప్తిని ఆమోదించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కోటాను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకుని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేసి, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు నిర్ణీత గడువులో బియ్యాన్ని అందజేయాలని సూచించారు. గత సీజన్లకు సంబంధించిన పెండింగ్ బియ్యం కోటాను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!