

ఆంధ్రప్రదేశ్లో పలు పోలీస్ స్టేషన్లలో రాజకీయ నేతలపై అవాస్తవాలు, అబద్ధపు ప్రచారం చేశారన్న ఆరోపణలపై పలు కేసులు నమోదు అయ్యాయి. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు శిరంగు శ్రీనివాస రావు ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్ నాగేశ్వర్, ఒక టీవీ ఛానల్ మరియు ఒక జర్నలిస్టుపై కేసు నమోదు చేయాలని కోరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్పై అవాస్తవాలు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో జనసేన కార్యకర్త మత్తి రాము ఒక వెబ్సైట్ మరియు దాని నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. అలాగే కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో జనసేన కార్యకర్త నల్లం శ్రీరాములు ప్రొఫెసర్ నాగేశ్వర్, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మరియు ఒక మీడియా సంస్థపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!