
సినిమాలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణను నాంపల్లి కోర్టు జూలై 6కు వాయిదా వేసింది. సినిమా చిత్రీకరణ కోసం ముంబైలో ఉన్న అల్లు అర్జున్ కోర్టుకు హాజరుకాలేకపోయారు. దీంతో వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యేందుకు ఆయన తరఫు న్యాయవాదులు అనుమతి కోరారు.
అల్లు అర్జున్ గైర్హాజరుపై మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. విచారణలో భాగంగా 12 మంది నిందితులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. జూలై 6న జరిగే తదుపరి విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!