

పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ప్రతి మ్యాచ్ అనంతరం సరదాగా చిత్రాలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. అతడు చేసే వీడియోలు తరచుగా విస్తృతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే ఐపీఎల్ 2026 ముగిసే వరకు అలాంటి వీడియోలు పంచుకోవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి అర్ష్దీప్కు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ తర్వాత అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తున్న సమయంలో అర్ష్దీప్ చేసిన వీడియోలో యుజ్వేంద్ర చాహల్ చేతులతో ముఖాన్ని కప్పుకుని ధూమపానం చేస్తున్నట్లుగా కనిపించాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు చాహల్ గానీ, పంజాబ్ జట్టు గానీ అధికారికంగా స్పందించలేదు. ఇదే తరహాలో ఇటీవల రాజస్థాన్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ధూమపానం చేస్తూ కనిపించడంతో అతడిపై జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అర్ష్దీప్కు మండలి సూచనలు చేసినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!