
జనరల్

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ-బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్త బస్సులను వెంటనే ప్రవేశపెట్టి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేయాలని కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను ఈ నెల 27న జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!