
జనరల్

ఆంధ్రప్రదేశ్లో కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల కోసం నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం ఈ నెల 17 నుంచి 21 వరకు దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ చేపట్టనున్నారు.
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ నెల 25, 26 తేదీల్లో అర్హులైన వారికి పెన్షన్లను ప్రభుత్వం ఆమోదించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 62 లక్షల మంది వివిధ రకాల సామాజిక భద్రతా పెన్షన్లను అందుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!