

ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేయబడింది. ఒక ప్రైవేట్ మీడియా చర్చలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు అమిత్ షాపై ఒత్తిడి తెస్తున్నారని నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు అయ్యాయి.
తరువాత నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ, అవి తప్పుగా తెలిసిన సమాచారంపై ఆధారపడ్డవని చెప్పారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లకు క్షమాపణలు తెలియజేశారు. ఈ పరిణామంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముగిసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇప్పటికే కేసులు నమోదు కావడంతో పోలీసులు విచారణ కొనసాగించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని మణికొండలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేయనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఆయన భార్య శ్రీ లక్ష్మి, తెలంగాణ పోలీసులు భద్రత కల్పిస్తున్నారని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!