

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో 80కి పైగా కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఫారసు చేసిన దాదాపు ₹34 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో సుమారు 35 వేల ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమమైంది.
అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉండవల్లిలో ₹426 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ₹139 కోట్లతో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం, అనంతపురం-కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు వంటి ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే నిర్ణయానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!