

హైదరాబాద్ ట్యాంక్బండ్ సమీపంలోని శిథిలావస్థకు చేరిన అంబేడ్కర్ భవన్ను అత్యాధునిక సదుపాయాలతో కూడిన అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్గా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం రాజధానికి వచ్చే నిరుపేద విద్యార్థుల కోసం కాచిగూడలోని బాబూ జగ్జీవన్రామ్ విద్యార్థి వసతి గృహ సముదాయాన్ని ఆదర్శ వసతి కేంద్రంగా తీర్చిదిద్దనుంది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించారు.
అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రంథాలయం, ఈ-గ్రంథాలయం, డిజిటల్ విద్యా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అలాగే సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, సిబ్బంది ఎంపిక పరీక్షలు, రైల్వే ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ, వృత్తి మార్గదర్శకం, నైపుణ్యాభివృద్ధి సదుపాయాలు కల్పించనున్నారు. ఈ కేంద్రం వేలాది మంది దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థుల ఆశయాలకు వేదికగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!