
సినిమాలు

నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న ఈ ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తల పట్ల అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్టీ ప్రతినిధి అభిజిత్ దీప్కే ఆరోపించారు.
జంతర్మంతర్లోని మరుగుదొడ్లకు వరుసగా రెండో రోజూ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. దీంతో నిరసనకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించి, నిరసనకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా ప్రస్తావించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!