
రాజకీయాలు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన చందాదారులకు కొత్త డిజిటల్ వేదిక ద్వారా కీలక సౌకర్యాన్ని అందించనుంది. ఈపీఎఫ్ఓ 3.0 కింద పీఎఫ్ ఖాతాదారులు తమ నిధులను నేరుగా యూపీఐ ఆధారిత చెల్లింపు వేదికలు, ఈపీఎఫ్ఓ అనుసంధానిత నగదు యంత్రాల ద్వారా ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు. ఈ సదుపాయం ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
జాతీయ చెల్లింపుల సంస్థ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ వ్యవస్థ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. కొత్త విధానం ప్రకారం ఖాతాదారులు తమ పీఎఫ్ నిల్వలో గరిష్ఠంగా 75 శాతం వరకు తక్షణమే ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 25 శాతం నిధిని భవిష్య అవసరాల కోసం ఖాతాలో కొనసాగించాల్సి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!