

డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం అంతర్జాతీయ నౌకాశ్రయ రంగాన్ని క్లిష్టమైన పరిస్థితుల్లోకి నెట్టింది. సాధారణంగా రోజుకు సుమారు 135 నౌకలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి, అయితే ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా రవాణా దాదాపు పూర్తిగా నిలిచిపోయింది.
ఇరాన్ కు చెందిన నౌకలను అమెరికా అడ్డుకుంటుండగా, ప్రతిస్పందనగా ఇరాన్ తన గన్బోట్లతో జలసంధిలో రాకపోకలను పరిమితం చేస్తోంది. ఈ సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.
ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు ఉత్పత్తి సుమారు 57 శాతం వరకు తగ్గింది. ఈ ప్రాంతంలో సుమారు 20,000 మంది నావికులు నౌకల్లోనే చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం నౌకాశ్రయ సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు సురక్షితంగా భావించిన ఈ మార్గం ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. దిగ్బంధనం ఎత్తివేయకపోతే పరిస్థితి మెరుగుపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!