
బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు బలమైన లాభాలతో ముగిశాయి. రోజంతా సానుకూల ధోరణి కనబరిచిన మార్కెట్లు చివరికి భారీగా ఎగసిపడ్డాయి. యుద్ధ ఆందోళనల మధ్య కూడా కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లు పెరగడం సెంటిమెంట్ను బలపరిచింది.
ఈ రోజు ముగింపు సమయానికి సెన్సెక్స్ 899 పాయింట్లు ఎగసి 80,015 వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ 285 పాయింట్ల లాభంతో 24,765 వద్ద స్థిరపడింది. ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పెరిగి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో మధ్యాహ్నం వరకు సూచీల్లో కొంత ఊగిసలాట కనిపించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!