
గాసిప్స్

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఈ రోజు ఆదివారం అయినప్పటికీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తున్నారు. బడ్జెట్ ప్రకటనలకు మార్కెట్ వెంటనే స్పందించే అవకాశం కల్పించడమే దీనికి కారణం. ఈ రోజు ట్రేడింగ్ సాధారణ పని దినం మాదిరిగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది.
అయితే, ఈ రోజు సెటిల్మెంట్ జరగదు. శుక్రవారం కొనుగోలు చేసిన షేర్లను ఈ రోజు విక్రయించేందుకు అనుమతి ఉండదు. అలాగే, ఈ రోజు జరిగే లావాదేవీల సెటిల్మెంట్ సోమవారం పూర్తి అవుతుంది. ఈ కారణంగా ట్రేడర్లు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!