

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్తో తుది ఒప్పందం కుదరబోతోందని ప్రకటించడం, హోర్ముజ్ ప్రాంతంలో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పడం మార్కెట్కు ప్రోత్సాహం ఇచ్చింది. అంతర్జాతీయ పరిస్థితుల్లో సానుకూల సంకేతాలు కనిపించడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది.
మరోవైపు డాలర్తో పోల్చితే రూపాయి బలపడడం కూడా మార్కెట్కు అనుకూలంగా మారింది. ప్రస్తుతం డాలర్కు రూపాయి మారకం విలువ 95.08 వద్ద ఉంది. ఈ ప్రభావంతో ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ప్రారంభంలోనే సూచీలు గణనీయంగా పెరిగాయి.
సెన్సెక్స్ దాదాపు నాలుగు వందల పాయింట్ల లాభంతో ప్రారంభమై, తర్వాత కొంత తగ్గినా ఉదయం పది గంటల సమయంలో మూడువందల పైగా పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ కూడా లాభాల్లోనే ఉంది. కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు పెరుగుతుండగా, మరికొన్ని షేర్లు తగ్గుదల చూపుతున్నాయి. మధ్య స్థాయి సూచీ మరియు బ్యాంకింగ్ సూచీ కూడా లాభాల్లో ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!