

బంగారు ఆభరణాల రిటైల్ కంపెనీ లలితా జ్యువెలరీ తన పబ్లిక్ ఇష్యూ (IPO)కు ఒక్కో ఈక్విటీ షేరుకు ₹190–201 ధరల శ్రేణిని ప్రకటించింది. ఆగస్టు 17న ప్రారంభమయ్యే ఐపీఓ ఆగస్టు 19న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఆగస్టు 14న షేర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఇష్యూ ద్వారా మొత్తం ₹1,700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ₹1,200 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండగా, మరో ₹500 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు.
తాజా షేర్ల జారీ ద్వారా సమకూరే నిధులను ప్రధానంగా కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఖర్చు చేయనుంది. 1985లో చెన్నైలోని టీనగర్లో తొలి స్టోర్ను ప్రారంభించిన లలితా జ్యువెలరీ ప్రధానంగా బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలను విక్రయిస్తోంది. ఆగస్టు 24న బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టింగ్ కానున్న ఈ కంపెనీ విలువ సుమారు ₹11,250 కోట్లకు చేరే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!