

ప్రస్తుత రోజుల్లో మొబైల్ వినియోగం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి అంశంగా మారింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు వాలిడ్ రీఛార్జ్ లేకపోతే కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. ఒక్క రోజు ఆలస్యమైనా సేవలు నిలిపివేయడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను నివారించేందుకు చాలా మంది దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఏడాది వ్యాలిడిటీ ఉన్న రీఛార్జ్ ప్లాన్లు మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసే ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నాన్ స్టాప్ కనెక్షన్ పేరుతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. రూ. 2,399 ధరతో అందుబాటులో ఉన్న ఈ ప్లాన్కు 365 రోజుల వ్యాలిడిటీ ఉంది. ఇందులో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ను బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వీఐ వార్షిక ప్లాన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!