

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. అనుబంధ పరిశ్రమలతో కలిపి సుమారు ₹1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టు అమలు కానుంది. సుమారు 140 యుద్ధ విమానాలు ఇక్కడ తయారుకానున్నాయి. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA) డిజైన్, టెస్టింగ్ పనులు పూర్తి చేసి పుట్టపర్తికి మాడ్యూళ్లు పంపనుంది. తుది అసెంబ్లింగ్, గ్రౌండ్ టెస్టింగ్ ఇక్కడే జరుగుతుంది. ప్రభుత్వం 600 ఎకరాలు కేటాయించగా, అదనంగా 400 ఎకరాలు అనుబంధ యూనిట్ల కోసం సిద్ధం చేసింది. టాటా, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ కంపెనీలు ఇందులో భాగస్వామ్యంగా ఉండనున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!