
గాసిప్స్

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు చెందిన అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్ సరికొత్తగా యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. టచ్ పాయింట్ల వద్ద తన బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా అందిస్తున్న ఈ సేవలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసే కీలక ముందడుగుగా సంస్థ పేర్కొంది.
ప్రత్యేకంగా గ్రామీణ మరియు పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమ యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సులభంగా నగదును ఉపసంహరించుకోవచ్చు.
ఈ ప్రక్రియలో డెబిట్ కార్డు లేదా ఏటీఎం అవసరం లేకుండానే నగదు పొందే సౌకర్యం కల్పించబడినట్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పష్టం చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!