

వచ్చే కేంద్ర బడ్జెట్లో తమ విన్నపాలకు ప్రాధాన్యం ఇవ్వాలని క్యాపిటల్ మార్కెట్ వర్గాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, దీర్ఘకాలిక మదుపరులను ప్రోత్సహించేలా పన్ను సంస్కరణలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశాయి.
దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) ప్రస్తుతం ఉన్న 12.5 శాతం నుంచి 10 శాతానికి, అలాగే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (ఎస్టీసీజీ) 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని సూచించాయి. అదనంగా, ప్రస్తుతం ఏటా రూ.1.25 లక్షల వరకు ఉన్న ఎల్టీసీజీ మినహాయింపు పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ అభిప్రాయపడింది.
ఇతర ముఖ్య డిమాండ్లు
షేర్ల లావాదేవీల పన్ను (ఎస్టిటి)ను మరింతగా పెంచవద్దు.
బంగారం, వెండిపై అదనపు పన్నుల భారం విధించవద్దు.
ఈక్విటీ, రియల్టీ, డెట్, పసిడి వంటి అన్ని ఆస్తుల దీర్ఘకాలిక లాభాలకు 12 నెలల హోల్డింగ్ పీరియడ్ను వర్తింప చేయాలి.
ఒక ఆస్తి లావాదేవీలో వచ్చిన నష్టాన్ని, ఇతర ఆస్తుల విక్రయ లాభాలతో సమన్వయం చేసుకునే అవకాశం కల్పించాలి.
నగదు ఈక్విటీ లావాదేవీలపై ఎస్టిటి, డెరివేటివ్స్ కంటే తక్కువగా ఉండాలి.
షేర్ల బైబ్యాక్లో వచ్చిన లాభాలపై మాత్రమే పన్ను విధించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!