
క్రీడలు

కృత్రిమ మేధపై భారీగా పెట్టుబడులు పెడుతున్న మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో ఎక్కువకాలం పనిచేసిన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీవిరమణ పథకాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగి వయసు, సర్వీసు కలిపి 70 ఏళ్లు దాటితే ఈ ఆఫర్కు అర్హత ఉంటుంది. ఈ పథకం కింద ఐదేళ్ల ఆరోగ్య సంరక్షణ, ఒకేసారి నగదు చెల్లింపు, షేర్లకు సంబంధించిన ప్రయోజనాలు అందించనుంది.
అమెరికాలోని ఉద్యోగుల్లో దాదాపు 7 శాతం మంది ఈ పథకానికి అర్హులుగా ఉండొచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇందుకోసం సంస్థ సుమారు 900 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు సమాచారం. మరోవైపు త్వరలో ఉద్యోగుల కోతలు కూడా ఉండే అవకాశం ఉందని సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త నియామకాల వేగాన్ని తగ్గిస్తూ ఏఐ పెట్టుబడులు, వ్యయ నియంత్రణపై సంస్థ మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!