

అంతరిక్ష పరిశోధనలో నాసా మరో కీలక ముందడుగు వేసింది. మంగళగ్రహంపై పనిచేస్తున్న పర్సెవరెన్స్ రోవర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన సూచనలతో తొలిసారి విజయవంతంగా ముందుకు కదిలింది. ఈ నెల 27 న జరిగిన ఈ ప్రయాణంలో, ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ‘క్లాడ్’ అనే ఏఐ చాట్బాట్ ఇచ్చిన దారిదీపిక సూచనలు ఉపయోగపడాయి.
నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ తెలిపిన వివరాల ప్రకారం, మంగళగ్రహ భూభాగ చిత్రాలు, మ్యాపులు మరియు శాస్త్రీయ లక్ష్యాలను పరిశీలించిన క్లాడ్ ఏఐ, రోవర్ వెళ్లాల్సిన దారిని సూచించింది. ఆ సూచనలను నాసా ఇంజినీర్లు పరిశీలించి సరిచేసిన తర్వాత మంగళగ్రహానికి పంపారు. దాని ఆధారంగా పర్సెవరెన్స్ జెజెరో క్రేటర్ ప్రాంతంలో సుమారు 23 మీటర్లు సురక్షితంగా ప్రయాణించింది. ఏఐ రోవర్ను నేరుగా నియంత్రించలేదని, కేవలం ప్రణాళిక తయారీలో సహాయం మాత్రమే చేసిందని నాసా స్పష్టం చేసింది. భవిష్యత్లో ఈ సాంకేతికత మంగళగ్రహంపై మరింత పొడవైన ప్రయాణాలకు ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!