
టెక్నాలజీ

హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశంలో తన తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళికలను ప్రకటించింది. 2028 నుంచి ఏటా 80 లక్షల యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంతో రాజస్థాన్, గుజరాత్లోని తయారీ ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నట్లు సంస్థ వెల్లడించింది. భారత ద్విచక్ర వాహన మార్కెట్పై కంపెనీకి ఉన్న విశ్వాసానికి ఈ నిర్ణయం నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ విస్తరణ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3,800 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈవో సుత్సుము ఒటానీ తెలిపారు. దేశీయ డిమాండ్ను మరింత సమర్థంగా తీర్చడంతో పాటు భారత తయారీ రంగంలో హోండా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!