

టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే క్రికెట్ అభిమానులకు మరో భారీ వినోదం అందించేందుకు ఐపీఎల్ 2026 సిద్ధమవుతోంది. ఈ నెల 28న లీగ్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. బీసీసీఐ ఇప్పటివరకు తొలి 20 మ్యాచ్ల షెడ్యూలును మాత్రమే ప్రకటించింది. రాష్ట్రాల ఎన్నికలు మరియు అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మిగతా మ్యాచ్ల షెడ్యూలును త్వరలో ఖరారు చేయనుంది.
ఈ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తు కూడా చర్చనీయాంశంగా మారింది. 44 ఏళ్ల వయసులో ఉన్న ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీపై కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ షెడ్యూలు ప్రకారమే నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్ కెప్టెన్గా వ్యవహరించనుండటం కూడా మరో ఆసక్తికర అంశంగా మారింది.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!