

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రపంచ క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హొలిహాన్ లోకీ విడుదల చేసిన తాజా బ్రాండ్ మూల్యాంకన నివేదిక ప్రకారం, 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ దాటిన ప్రపంచంలోనే తొలి క్రికెట్ జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ప్రస్తుతం ఆర్సీబీ బ్రాండ్ విలువ రూ.2,986 కోట్లు కాగా, ముంబయి ఇండియన్స్ (రూ.2,526 కోట్లు), కోల్కతా నైట్రైడర్స్ (రూ.2,344 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ.2,335 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇక ఐపీఎల్ బ్రాండ్ విలువ ప్రతి సీజన్తో మరింత పెరుగుతోందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా డిజిటల్ వేదికలపై ఐపీఎల్ను వీక్షించే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వెల్లడించింది. ఇటీవల యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఆర్సీబీ ఫ్రాంచైజీని బ్లాక్స్టోన్, బోల్ట్ వెంచర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా కన్సార్షియమ్కు సుమారు రూ.16,705 కోట్లకు విక్రయించడం, ఈ ఫ్రాంచైజీ వాణిజ్య విలువ ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి నిరూపించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!