

ఈ ఏడాది ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ఉత్కంఠభరితంగా ముగిసింది. ఫైనల్లో ఢిల్లీ జట్టు పుణేరి పల్టాన్ పై 31–28 తేడాతో విజయం సాధించి, ఈ సీజన్ కప్ను కైవసం చేసుకుంది.
ప్రారంభం నుంచే టైటిల్ ఫేవరెట్స్గా ఉన్న ఢిల్లీ, అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ఆడి అభిమానుల అంచనాలను నిజం చేసింది. ఇది ఢిల్లీ జట్టుకు రెండవ ఛాంపియన్ టైటిల్, 2021లో తొలిసారి విజయం సాధించిన తర్వాత మరోసారి ఘనత సాధించింది.
ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ రైడర్లు, డిఫెండర్లు అద్భుత సమన్వయంతో ఆడి ప్రత్యర్థి జట్టును కష్టాల్లోకి నెట్టారు. పుణేరి పల్టాన్ కూడా గట్టి పోటీ ఇచ్చినా, చివర్లో ఢిల్లీ దూకుడుకు నిలవలేకపోయింది.
ఇక తెలుగు అభిమానులు ఆశించిన తెలుగు టైటాన్స్ సెమీఫైనల్లో పుణేరి పల్టాన్ చేతిలో ఓడిపోవడంతో ఫైనల్లోకి ప్రవేశించలేకపోయారు. అయినప్పటికీ, ఈ సీజన్లో టైటాన్స్ ప్రదర్శన గత సీజన్లతో పోల్చితే మెరుగ్గా నిలిచింది.
ఢిల్లీ విజయం ప్రో కబడ్డీ చరిత్రలో మరో గొప్ప ఘట్టంగా నిలిచింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!