
సినిమాలు

ఐపీఎల్ 2026 లో ఒక్క పాయింట్ తేడాతో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అదే పాయింట్ ఇప్పుడు పంజాబ్కు కీలకంగా మారిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అప్పట్లో శ్రేష్ఠ అయ్యర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోలో ‘కోల్కతాకు దయతో ఒక పాయింట్ ఇచ్చాం’ అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోను గుర్తు చేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ ఒక్క పాయింటే పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!