

లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో కోల్కతా జట్టు విజయం సాధించగా, ఆ ఆనంద క్షణాల్లోనే భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. అయితే స్టాండ్స్లో ఉన్న ఆయనకు కాబోయే భార్య ప్రియా సరోజ్ తన మామ జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కదిలించింది.
మ్యాచ్ అనంతరం జట్టు పంచుకున్న వీడియోలో ప్రియా సరోజ్ మాట్లాడుతూ రింకూ ఆడిన ఈ ఇన్నింగ్స్ను తన మామగారికి అంకితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ విజయం చూసి ఆయన ఎంతో గర్వపడేవారని, ఈ సమయంలో ఆయనను చాలా మిస్ అవుతున్నామని భావోద్వేగంగా పేర్కొంది. రింకూ సింగ్ తండ్రి గత ఫిబ్రవరిలో అనారోగ్యంతో కన్నుమూయగా, ఆ బాధను జయించి ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అభిమానులను కదిలిస్తోంది.
మ్యాచ్ విషయానికి వస్తే, మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ ఒత్తిడిని తట్టుకుని అద్భుతంగా ఆడాడు. 51 బంతుల్లో 83 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టుకు పోటీ స్థాయి స్కోరు అందించాడు. మ్యాచ్ చివరకు టై కావడంతో సూపర్ ఓవర్కు వెళ్లగా, అక్కడ కూడా రింకూ తన ప్రతిభ చూపించి జట్టుకు విజయాన్ని అందించాడు.














.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!