

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ క్రికెట్కు అధికారికంగా వీడ్కోలు తెలిపారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన, 2015లో చివరిసారి భారత జట్టు తరఫున ఆడారు. మీడియం పేసర్గా పేరు తెచ్చుకున్న మోహిత్ అంతర్జాతీయ కెరీర్లో 26 వన్డేలలో 31 వికెట్లు, 8 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 6 వికెట్లు సాధించారు. భారత జట్టులో ఎక్కువ కాలం ఆడకపోయినా, తన ప్రతిభతో గుర్తింపు పొందిన బౌలర్గా నిలిచారు.
అంతర్జాతీయ క్రికెట్తో పాటు IPLలో కూడా మోహిత్ శర్మ మంచి గుర్తింపు పొందారు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా MS ధోనీ నేతృత్వంలోని CSK తరపున ఆడినప్పుడు ఆయన ప్రదర్శనలు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. IPLలో తన అనుభవం, డెత్ ఓవర్ బౌలింగ్ నైపుణ్యం కారణంగా జట్టుకు కీలకమైన వికెట్లు అందించారు. రిటైర్మెంట్ ప్రకటించిన మోహిత్ శర్మకి అభిమానులు, క్రికెట్ వర్గాలు వీడ్కోలు తెలిపారు






.jpg&w=3840&q=75)










.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!