

భారతదేశంలో ఎన్నికల హడావుడి కొనసాగినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్కు అభిమానుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్షిప్ ఈసారి నమోదైంది. టీవీ, డిజిటల్ ప్లాట్ఫామ్లలో కలిపి 1.1 బిలియన్ వ్యూస్ వచ్చినట్లు జియో హాట్స్టార్ వెల్లడించింది. టీవీ వ్యూయర్షిప్ మాత్రమే 50 కోట్ల మార్క్ను తాకడం విశేషం.
డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి నమోదుకాగా, మ్యాచ్ల వీక్షణ సమయం 7 శాతం పెరిగిందని జియో తెలిపింది. ప్రాంతీయ భాషల్లో వ్యూయర్షిప్ 42 శాతం పెరగడం మరో విశేషం. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారడంతో రాబోయే మ్యాచుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జియోస్టార్ సేల్స్ హెడ్ అనుప్ గోవిందన్ మాట్లాడుతూ అభిమానుల ఆదరణ అద్భుతంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన గణాంకాలు 51వ మ్యాచ్ వరకు మాత్రమే కాగా, ఇప్పటికే 58 మ్యాచులు పూర్తయ్యాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!