

ఐపీఎల్ 2026లో వాంఖేడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు ప్రారంభంలో తడబడినా, సమష్టి ప్రదర్శనతో 206 పరుగుల లక్ష్యాన్ని ముంబై ముందుంచింది.
టాపార్డర్ విఫలమైన సమయంలో జోఫ్రా ఆర్చర్ దూకుడుగా ఆడి కేవలం 15 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. అనంతరం బౌలింగ్లోనూ అద్భుతంగా రాణించి మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని అద్భుత ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పూర్తిగా ఫిట్గా లేకపోయినా, జట్టు అవసరం కోసం ఈ మ్యాచ్ ఆడానని తెలిపాడు. హార్దిక్ పాండ్యను ఔట్ చేయగలడనే నమ్మకంతో ఆర్చర్కు కీలక బాధ్యతలు ఇచ్చానని చెప్పాడు. టోర్నీలో కొన్ని మ్యాచ్లు చేజార్చుకున్నామని, ఇంకా కొన్ని విభాగాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని రియాన్ పరాగ్ వెల్లడించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!