
రాజకీయాలు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించే అవకాశంపై టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఒక నెటిజన్ అశ్విన్ను కోచ్గా తీసుకుంటే యూట్యూబ్ వ్యూస్ కోసం మ్యాచ్కు ముందే తుది జట్టును ప్రకటిస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా, అశ్విన్ దానికి ఘాటుగా స్పందించారు. “ఇలాంటి వారు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, నీకు అసలు నియమాలు తెలుసా?” అంటూ ఆయన స్పందన ఇచ్చారు.
అదేవిధంగా, “ధోనీ లాంటి వ్యక్తి టీమ్లో ఉన్నప్పుడు మరో కోచ్ కోసం ఎందుకు వెతుకుతారు?” అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ధోనీ భవిష్యత్తుపై కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. సీఎస్కే జట్టులో ధోనీ పాత్రపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!