
సినిమాలు

భారత క్రికెటర్ ఇషాన్ కిషన్కు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో చేసిన అద్భుత ప్రదర్శనకు గాను బిహార్ ప్రభుత్వం రూ.1 కోటి నగదు బహుమతిని ప్రకటించి ఘనంగా సత్కరించింది. ఈ సన్మానాన్ని బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి అందజేసి, భారత క్రికెట్కు ఇషాన్ కిషన్ అందించిన సేవలను ప్రశంసించారు.
ఇషాన్ కిషన్ తన ప్రతిభతో బిహార్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రభుత్వం పేర్కొంది. యువ క్రీడాకారులకు ఆయన స్ఫూర్తిగా మారారని కొనియాడింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!