
న్యూస్

యూసుఫ్గూడ నియోజకవర్గంలోని కృష్ణానగర్లో ఓ మహిళ నకిలీ ఓటు వేయడానికి వచ్చిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆమెను గుర్తించి వెంటనే అడ్డుకున్నారు. ఆ మహిళ అసలు ఓటర్ కాదని అనుమానంతో ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
ప్రజలు న్యాయంగా తమ ఓటు హక్కు వినియోగించాలని, ఏ రకమైన అక్రమ చర్యలకు పాల్పడకూడదని వారు సూచించారు.











కామెంట్స్ (1)
నకిలీ ఓటర్లపై కఠిన చర్యలు తప్పనిసరి.