

మొంథా తుఫాను తీవ్ర ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు నాయుడు వయసు, అలసట పక్కనబెట్టి, గత రెండు రోజులుగా 24 గంటలు తుఫాను పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రజల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, అధికారులను పర్యవేక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా అదే విధంగా జిల్లాల వారీగా చర్యలు చేపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పరిస్థితులు ఎలా మారినా, ప్రభుత్వం మరియు కూటమి బృందం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇక మరోవైపు, ప్రధాన ప్రతిపక్ష నేత మరియు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇది రాజకీయ విమర్శ కాదని, సాధారణ ప్రజల genuine ప్రశ్న అని చెప్పాలి.
జగన్ గారు, మీరు పేదల పక్షాన నిలబడతానని, ఎస్సీ, ఎస్టీల కోసం పోరాడతానని చెప్పారు. మరి ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు? అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఘాటుగా ఇప్పుడైనా తాడేపల్లినుంచి బయటికొచ్చి ప్రజల మధ్యకి రండి సర్ అని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, జగన్ ప్రస్తుతం తాడేపల్లిలో లేరని తెలుస్తోంది. తుఫాను ప్రభావం కారణంగా ఆయన బెంగళూరులోని సేఫ్ జోన్లో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం “తుఫాన్ కారణంగా జగన్ ప్రయాణించాల్సిన ఫ్లైట్ రద్దు అయింది, అందుకే ఆయన తాడేపల్లికి రాలేకపోయారు” అని స్పష్టంచేసింది. అయితే, నెటిజన్లు “ఫ్లైట్ లేకపోతే కారు వేసుకొని రాలేరా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!