

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పంథాను వేగవంతం చేయడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఈ దిశగా కీలక మలుపు కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత 16 నెలల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కలిసి విదేశీ పర్యటనల ద్వారా దాదాపు ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు. ఇప్పుడు విశాఖ సదస్సుతో మరో ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారని సమాచారం. 12 అంతర్జాతీయ సంస్థలు, 72 మంది స్పీకర్లు పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం 410 ఎంవోయూలు కుదుర్చుకునే లక్ష్యంతో ప్రభుత్వం సిద్ధమైంది. వీటివల్ల దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే పలు పెద్ద ప్రాజెక్టులు ఖరారవుతున్నాయి —
అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ రూ.1.5 లక్షల కోట్లతో స్టీల్ ప్రాజెక్టు
గూగుల్ డేటా సెంటర్ — ₹15 బిలియన్ డాలర్ల పెట్టుబడి
బీపీసీఎల్ నెల్లూరులో లక్ష కోట్ల ప్రాజెక్టు
ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు — ₹1.25 లక్షల కోట్లు
అలాగే జిల్లాల వారీగా ప్రత్యేక రంగాల అభివృద్ధి ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, కర్నూలులో పునరుత్పాదక ఇంధన కేంద్రాలు, గోదావరి జిల్లాల్లో ఆక్వా, రిఫైనరీ పరిశ్రమలు ఏర్పడనున్నాయి.
విశాఖలో జరగబోయే ఈ సదస్సు, రాష్ట్రానికి పెట్టుబడులు మాత్రమే కాకుండా ఉపాధి, సాంకేతికత, పరిశ్రమల విస్తరణలో కొత్త దారులు చూపే “గేమ్ ఛేంజర్” అవుతుందని పరిశ్రమ వర్గాలు నమ్ముతున్నాయి.











కామెంట్స్ (3)
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దశ ప్రారంభం!
వ్యవసాయ మార్గదర్శకం
Great initiative!